ఐపీఎల్ -2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత బలమైన ఆటగాడిగా మారతాడు అనుకున్న మిచెల్ మార్ష్ గాయానికి గురయ్యాడు. మార్ష్ తుంటికి గాయం తగలడంతో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు దూరమయ్యాడు.
తాజాగా ఐపీఎల్ సీజన్లో కూడా మార్ష్ ఆడేది అనుమానం అని డీసీ జట్టు అధికారుల అనాధికార సమాచారం. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేళంలో రూ.6.5కోట్లు వెచ్చించి మార్ష్ ను డీసీ దక్కించుకుంది. అయితే పాకిస్థాన్ తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఏఫ్రిల్ ఆరు తారీఖున ఐపీఎల్ ఆడటానికి రావాల్సి ఉంది.