తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి భరోసా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు.
వనపర్తిలోని మంత్రి సింగిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో రూ.30 లక్షల 60 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను 111 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ పేదలను దృష్టిలో పెట్టుకుని పలు సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేశామన్నారు.
పండుటాకులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు భరోసానిస్తూ ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు సాటిరాదని స్పష్టం చేశారు.