Home / SLIDER / కమర్షియల్‌ సిలిండర్‌ ధర జోక్‌ అయితే బాగుండు – మంత్రి కేటీఆర్‌ ట్వీట్లు

కమర్షియల్‌ సిలిండర్‌ ధర జోక్‌ అయితే బాగుండు – మంత్రి కేటీఆర్‌ ట్వీట్లు

’19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. ఇప్పుడా గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,253కు చేరింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి’ అనే వార్తను ట్వీట్‌ చేశారు. ఇది ‘ఏప్రిల్‌ ఫూల్‌ తరహాలో జోక్‌ అయితే బాగుండేదని నేను తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాసేపటికి ‘ఏప్రిల్‌ ఫస్ట్‌ చాలా ముఖ్యమైన రోజు.. నేను దీన్ని అచ్చే దిన్‌ దివస్‌’గా సెలబ్రేట్‌ చేసుకుంటా’ అనే సందేశం ఇస్తున్న కార్టూన్‌తోపాటు ‘ఏప్రిల్‌ ఫూల్స్‌ డే.. అచ్చేదిన్‌ దివస్‌’ అని వ్యంగ్యంగా ట్వీట్లు చేశారు.

భయపడేవారు నన్ను అన్‌ఫాలో అవ్వండి

ఎన్‌డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి కొన్ని వాస్తవాలను పోస్ట్‌ చేసిన ప్రతీసారి భయపడే, కుంగిపోయే వ్యక్తులు ట్విట్టర్‌లో తనను అనుసరించొద్దని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ‘బీజేపీ మతోన్మాదాన్ని, తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతా. బహిర్గతం చేయడం కొనసాగిస్తూనే ఉంటా. అందుకే దయచేసి నన్ను అన్‌ఫాలో చేయండి’ అని కోరుతూ ట్వీట్‌ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat