తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఆదిరిపోయే ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఉగాది (శనివారం) రోజున 65 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం కల్పించడంతోపాటు ఈనెల 10 వరకు పార్శిల్స్పై 25 శాతం రాయితీ కల్పిస్తోంది.
ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఈడీ యాదగిరి కోరారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్పాస్ కేంద్రాలకు సెలవని, ఆదివారం యధావిధిగా ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 వరకు పనిచేస్తాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.