Home / SLIDER / ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలి

ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలి

ఆరోగ్య సూచిల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చాలని వైద్యారోగ్య సిబ్బంది, అధికారులకు సూచన. ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్నామని గుర్తు చేస్తూ..ఇందుకోసం ప్రతి ఒక్కరు పోటీతత్వంతో పని చేయాలని పిలుపు. ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ గారు వైద్యారోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. రూ. 11,237 కోట్లతొ గతేడాది కంటే రెట్టింపు కేటాయింపులు చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నూతనోత్సాహంతో పని చేయాలి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నఆశాలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలతో టెలికాన్ఫరెన్స్‌. ఈ సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, డీహెచ్‌ శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సబ్‌ సెంటర్‌, పీహెచ్‌సీల వారీగా పురోగతి పై సమీక్ష. ఆశా, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్లతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏఎన్‌సీ చెకప్స్‌, డెలివరీలు, ఎన్‌సీడీ ప్రోగ్రాం, వ్యాక్సినేషన్‌ తదితర కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత సహా మరేఇతర ఇబ్బందులు లేకుండా చూసుకుంటుంది. ప్రభుత్వ కృషికి తోడు ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతతో సహకరించాలి. అందరం కలిసి పని చేయడం వల్ల ఎంఎంఆర్‌ సూచీలో తమిళనాడును అధిగమించి దేశంలో రెండో స్థానానికి చేరుకున్నాం. ఇంతటితో ఆగకుండా మొదటి స్థానానికి చేరడమే మన లక్ష్యం, ఇతర పారామీటర్లలో కూడా పురోగతి నమోదు చేయాలి.

మంచి పనితీరు కనబర్చిన డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ వైద్యులు, ఆశాలు, ఏఎన్‌ఎంలకు ఈనెల 7న వరల్డ్‌ హెల్త్‌ డే పురస్కరించుకొని నగదు ప్రోత్సాహంతో పాటు సన్మానం ఉంటుంది. ప్ర‌తి విభాగంలో ముగ్గురిని ఎంపిక చేసి స‌న్మానిస్తాము. ఇక‌పై ప్ర‌తి మూడు నెలలకొకసారి ఇలాంటి కార్య‌క్ర‌మం ఉంటుంది. అదే స‌మ‌యంలో.. పని చేయని వారిపై చర్యలు ఉంటాయి.

ఏఎన్‌సీ చెకప్స్‌ సక్రమంగా నిర్వహించాలని, గర్బిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి ఆదేశాలు. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలని సూచన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే సెక్షన్లపై గైనకాలజిస్టుల వారీగా పరిశీలన నిర్వహిస్తాము. ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరుగుతుండటం పట్ల పరిశీలన చేసి, తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలను ఆదేశం. ఇక నుంచి ప్రతి నెల అన్ని పారామీటర్ల మీద సమీక్ష ఉంటుందని, ప్రతి ఒక్కరు రిపోర్టులతో సిద్ధంగా ఉండాలి. వ్యాక్సినేషన్‌ వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచన. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలు ఎక్కువగా ఫీల్డ్‌ విజిట్స్‌ చేయాలని, పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశం. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాస రావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణలు వారానికి ఒక జిల్లాకు వస్తారు, సర్‌ప్రైజ్‌ విజిట్స్‌ చేస్తారు. పనిచేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉంటాయి, ఇదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, రాష్ట్రానికి మంచి పేరు తేవాలి. ఆశా కార్యకర్తల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు మూడు సార్లు పెంచి, ప్రస్తుతం రూ.9750 పారితోషకాన్ని ఇస్తున్నారు. అందరం కలిసి శ్రమించి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు కృషి చేద్దాం.

● ఎన్‌హెచ్‌ఎంపై సమీక్ష..
అనంతరం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమీక్షలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి
కరుణ, డీఎంఈ రమేష్‌ రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాస రావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, స్టేట్‌ ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ సుధీర, ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమాల అధికారులు పాల్గొన్నారు. మెటర్నల్‌ హెల్త్‌, చైల్డ్‌ హెల్త్‌, మిడ్‌ వైఫరీ, నేషనల్‌ క్వాలిటీ అష్యురెన్స్‌ ప్రొగ్రాం, బస్తీ దవాఖానలు, 108, కేసీఆర్‌ కిట్లు, టి- డయాగ్నోస్టిక్స్‌, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌, టీబీ, సాంక్రమిక, ఆసాంక్రమిక వ్యాధులు తదితర విభాగాల పురోగతి పరిశీలన. అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచాలని, రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్నజిల్లాలు పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. విభాగాల వారీగా సమీక్షలు నిర్వహించాలని, ప్రతి నెల విభాగాల వారీగా నేను సమీక్ష నిర్వహిస్తానని తెలపడం జరిగింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నదని, మానవ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల సీజనల్‌ వ్యాధులు చాలా తగ్గాయని, మలేరియా విభాగంలో రాష్ట్రం కేటగిరి 2 నుంచి 1కి చేరింది, దీన్ని కేటగిరి సున్నాకు చేరుకునేలా చేసి, మలేరియా రహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి. జిల్లాల్లోని వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేసే బస్తీ దవాఖానల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat