ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన నిరసనల కార్యక్రమాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ధాన్యం కొనుగోలు అంశంపై ఈ నెల 11న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనకు నిన్న సీఎం కేసీఆర్ వెళ్లిన విషయం విదితమే.
రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది. ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనలు కొనసాగిస్తున్నారు.