సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 22 ఛానళ్లను బ్యాన్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ప్రకటించింది. దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం గుర్తించి ఆ మేరకు చర్యలు చేపట్టింది.
న్యూస్ ఛానళ్ల తరహాల థంబ్ నె యిల్స్, లోగోస్ వాడుతూ వీక్షకులను సైడ్ ట్రాక్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి బ్యాన్ చేసింది. ఈ 22 యూట్యూబ్ ఛానళ్లలో 18 ఇండియాకు చెందినవి కాగా.. మరో నాలుగు పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్నాయి. జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఆయా ఛానళ్లపై చర్యలు తీసుకుంది.