పెట్రోల్, డీజిల్ ధరల ఇప్పటికే వ్యంగ్యాస్త్రాలతో కేంద్రంపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. చమురు ధరలను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు.
దేశ ప్రజలపై రూ.26.5లక్షలకోట్ల పెట్రో పన్నుల భారం పడిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల నుంచి దోపిడీయే లక్ష్యంగా ‘పీఎం పెట్రో పన్ను యోజన’ తెచ్చారని ఎద్దేవా చేశారు. ఇది కూడా దేశం కోసం.. ధర్మం కోసమేనా అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఈ బాదుడు ఆపకపోతే ప్రజలే బీజేపీకి సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు.