Home / ANDHRAPRADESH / TDP నేతలకు సీఎం జగన్ వార్నింగ్

TDP నేతలకు సీఎం జగన్ వార్నింగ్

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ను పాలించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో   చేసిన అప్పులను కూడా తాము తీరుస్తున్నామని వైసీపీ అధినేత,ప్రస్తుత  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

నిన్న శుక్రవారం మీడియాతో ముఖ్యమంత్రి జగన్   మాట్లాడుతూ  ఏపీలో తమ ప్రభుత్వ హాయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు, టీడీపీకి చెందిన నేతలకు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కనిపించడం లేదని జగన్ మండిపడ్డారు.

కావాలనే టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. టీడీపీ కడుపుమంటకు, అసూయకు మందే లేదని ఆయన ఎద్దేవా చేశారు. కడుపుమంట, అసూయ పెరిగితే ఏదో రోజు గుండెపోటు వస్తుందన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద.. ఇప్పటివరకు 10 వేల 30 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్‌ చెప్పారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat