ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందేనని కేసీఆర్ హెచ్చరించారు.
హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. పీయూష్కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిలదీశారు.పీయూష్ గోయల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయనకు రైతులపై ఏమైనా అవగాహన ఉందా? అని ప్రశ్నించారు.
పీయూష్ గోయల్ మీరు ఇంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడారు. మా రైతులను, మంత్రులను అవహేళన చేశారని కేసీఆర్ నిప్పులు చెరిగారు.కేంద్ర మంత్రి తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరమైనవి. పీయూష్ గోయల్ తెలంగాణ అన్నదాతలు నూకలు తినాలని చెప్పారు. మేమైనా గోయల్ వద్ద అడుక్కోవడానికి వచ్చామా? పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్ మాల్ అని విమర్శించారు.