తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకుగాను దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. 2022–23 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం ప్రవేశాల గడువును పెంచామని వెల్లడించారు.
Tags educational minister of telangana kcr ktr patolla sabita indrareddy slider telanganacm telanganacmo trsgovernament tsrjc