సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్,సమంత హీరోహీరోయిన్లుగా నటించిగా విడుదలై ఘన విజయం సాధించిన రంగస్థలం సినిమాలో “జిగేల్ రాణి” అనే ఐటెం సాంగ్ తో యావత్తు కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన పూజా హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తుంది.
అయితే అటు హీరోయిన్ గా చేస్తూనే ఐటెం సాంగ్లకూ ఓకే చెప్తోంది. తాజాగా ఎఫ్-3 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సందిగా ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే అందుకు ఏకంగా రూ.1.25 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో రూ.కోటి ఇస్తామని ఒప్పించారట నిర్మాతలు.