తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి.
నిన్న సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదిక రైతు ధర్నాను నిర్వహించిన సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ రైతాంగం యాసంగిలో పండించిన వడ్లను కొనే అంశం గురించి నిర్ణయాన్ని చెప్పాలని మోదీకి ఇరవై నాలుగంటల డెడ్ లైన్ విధించారు.
ఈరోజుతో ఆ డెడ్ లైన్ ముగియనుండటంతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు క్యాబినేట్ సమావేశం కానున్నది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ధాన్యం కొనుగోలు,ఉద్యోగాలనోటిఫికేషన్ల గురించి చర్చించి నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.