Home / ANDHRAPRADESH / నేనెప్పుడూ జగన్‌కు విధేయురాలినే: సుచరిత

నేనెప్పుడూ జగన్‌కు విధేయురాలినే: సుచరిత

ఇటీవల మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఏపీ హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. కేబినెట్‌లో చోటు కల్పించలేకపోవడానికి గల కారణాలను సీఎం వివరించడంతో ఆమె మెత్తబడ్డారు. అనంతరం మీడియాతో సుచరిత మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. జడ్పీటీసీ నుంచి హోంమంత్రిగా ఎదిగేందుకు జగన్‌ అవకాశం కల్పించారన్నారు.

రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని.. అయితే పదవి రాకపోవడంతో చిన్న ఎమోషన్‌కు గురయ్యానని సుచరిత అన్నారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం తాను వైసీపీలోనే కొనసాగుతానని.. వేరే పార్టీల వైపు చూడాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎప్పటికీ తాను జగన్‌కు విధేయురాలినేని సుచరిత చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయని.. వ్యక్తిగత కారణాలతో కేబినెట్‌లో కొనసాగలేనేమోనని థాంక్స్‌ చెబుతూ సీఎంకు లెటర్‌ రాశానని ఆమె వివరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat