రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్పీకర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు.
సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయని పోచారం గుర్తు చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలన్నీ మానవీయ కోణంలో పనిచేయాలని సూచించారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. రాష్ట్రంలోని పేదలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రైతుబంధు, దళితబంధు పథకాలను అమలు చేస్తున్నారని గుత్తా చెప్పారు.