శ్రీలంక దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ పరిష్కారం చూపాలంటూ ఆ దేశ క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ 24 గంటలపాటు నిరాహార దీక్ష చేశాడు.
అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు ప్రకటించి నిరసనల్లో పాల్గొన్నాడు. అలాగే 2019లో ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 269 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.