ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఓబీసీలకు శుభవార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం . ఇందులో భాగంగా ఓబీసీల ఆదాయపరిమితిని రూ.10 లక్షలకు పెంచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు కసరత్తు చేస్తోంది.
సరిగ్గా ఐదేండ్ల కిందట అంటే 2017లో రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది బీజేపీ ప్రభుత్వం. తాజాగా దేశంలో ఉన్న పలు వివిధ రాజకీయ పార్టీలు ఈ పరిమితిని రూ.15లక్షలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో ఆదాయపరిమితిని కేంద్రం రూ.10 లక్షలకు ఆమోదం తెలిపినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. కేవలం ఆర్థిక ప్రమాణాలే కాకుండా, సామాజిక, ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉండనున్నట్లు సమాచారం.