Home / ANDHRAPRADESH / అనిల్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కాకాణి

అనిల్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కాకాణి

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌తో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయనే వార్తల నేపథ్యంలో సీఎం వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలను వారిద్దరూ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జగన్‌తో భేటీ అనంతరం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు.

అనిల్‌ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తమ మధ్య గొడవులు సృష్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేగా నెల్లూరులో అనిల్‌ సభ పెట్టుకోవడం తప్పుకాదన్నారు. తామిద్దరం పోటాపోటీ సభలు పెట్టుకున్నామంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కాకాణి చెప్పారు.

నెల్లూరు జిల్లా వైసీపీ స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. నీడనిచ్చే చెట్టునే నరుక్కునేంత మూర్ఖులం తాము కాదని కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా అభివృద్ధిపై దృష్టిపెట్టి సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్‌ తమను ఆదేశించినట్లు చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat