దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేట పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎస్టీపీ ద్వారా శుద్ధిచేసిన మురుగునీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తామని మని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు.
ఒకప్పుడు తాగునీటి సమస్యతో పిల్లనివ్వడానికి ముందుకు రాని సిద్దిపేటలో ప్రస్తుతం ఇంటింటికి శుద్ధమైన గోదావరి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మండుటెండలో కూడా కోమటిచేరువు మత్తడి పోస్తుందని మంత్రి పేర్కొన్నారు. ముడున్నర ఏండ్లలోనే అండర్ గౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను ఏర్పాటు చేసిన మొదటి పట్టణం సిద్దిపేట అన్నారు.