Home / POLITICS / కేసీఆర్‌ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు ఉంటుందా?: కేటీఆర్‌

కేసీఆర్‌ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు ఉంటుందా?: కేటీఆర్‌

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్‌జీ గ్యాస్‌ లైన్‌ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 43 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని.. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసం సీఎం కేసీఆర్‌ పడే తపన, బాధ.. కాంగ్రెస్‌, బీజేపీ నేతలకు ఉంటుందా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎప్పటికైనా మన ఇంటి పార్టీయే శ్రీరామరక్ష అవుతుందని.. మన ప్రయోజనాలను కాపాడుతుందని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పచ్చి మోసగాళ్లని.. వారి నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat