ఐపీఎల్ -2022 లీగ్ దశలో ఇప్పటీవరకు ఏడు మ్యాచులాడిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఐదు మ్యాచుల్లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అజేయంగా రెండో స్థానంలో కొనసాగుతుంది. నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను పద్దెనిమిది పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది బెంగళూరు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి డుప్లెసిస్ 96,షాబాజ్ 26 పరుగులతో రాణించడంతో 181పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో హోల్డర్ 2/25,చమీర 2/31రాణించారు.
లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన లక్నో మొత్తం ఇరవై ఓవర్లు ఆడి ఎనిమిది వికెట్ల ను కోల్పోయి 163పరుగులు సాధించింది. కృనాల్ పాండ్యా 42,కెప్టెన్ కేఎల్ రాహుల్ 30పరుగులతో పోరాడిన కానీ ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లలో హజిల్ వుడ్ నాలుగు వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.