బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కొన తెలియదు.. మొన తెలియదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరునెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తిచేయగలవో కాగితంపై రాసిస్తావా అని సంజయ్కు మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడి నుంచి నిధులు తెస్తోవో చెప్పగలవా? అని ప్రశ్నించారు.
కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల పంపులు తెలియవు.. రిజర్వాయర్లు కూడా ఆయనకు తెలియవన్నారు. ప్రాజెక్టుల గురించి తెలియకుండా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారనే ఇంగితం కూడా బండి సంజయ్కు లేదని మంత్రి తూర్పారబట్టారు.