Home / ANDHRAPRADESH / విజయవాడలో ఘోరం.. కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఎలక్ట్రిక్‌ బైక్‌

విజయవాడలో ఘోరం.. కుటుంబంలో తీవ్ర విషాదం నింపిన ఎలక్ట్రిక్‌ బైక్‌

విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.  కొత్తగా ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాననే ఆనందం  ఆవిరైపోవడమే కాకుండా ఆ వ్యక్తిని సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని సూర్యారావు పేటలోని గులాబీతోటకు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి శుక్రవారం కొత్త  ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నాడు. బైక్‌ బ్యాటరీకి శనివారం ఉదయం తన బెడ్‌రూంలో ఛార్జింగ్‌ పెట్టాడు. అయితే అది ఊహించని రీతిలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో శివకుమార్‌తో పాటు అతడి భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. వెంటనే స్థానికులు వారిని కాపాడి శివకుమార్‌, భార్య, పిల్లలిద్దరినీ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్ చనిపోగా.. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది. పిల్లల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఎంతో సరదాతో కొనుక్కున్న బైక్‌ ఇలా కుటుంబం మొత్తాన్ని తీవ్ర విషాదంలో నింపడం అందరినీ కలచివేస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat