బీహార్ రాష్ట్ర మాజీ మంత్రి,ఆర్జేడీ పార్టీకి చెందిన సీనియర్ ప్రముఖ నేత తేజ్ ప్రతాప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఆర్జేడీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే దీని గురించి తన తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి లాల్ ప్రసాద్ యాదవ్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు ఇవ్వనున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు.తనను రబ్రీ దేవి నివాసంలో బంధించి తేజ్ ప్రతాప్ యాదవ్ చితకబాదారని ఆర్జేడీ నేత రాంరాజ్ కుమార్ ఇటీవల ఆరోపించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేస్తానని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించడం బీహార్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది.