దేశంలో బీజేపీని ఓడించడం థర్డ్, ఫోర్త్ ఫ్రంట్తో కుదిరే పని కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదిగితే ఈజీగా బీజేపీని ఓడించ వచ్చని ఆయన సూచించారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పీకే పై వ్యాఖ్యలు చేశారు.
అయితే.. రాబోయే ఎన్నికల్లో తృణమూల్ను థర్డ్ఫ్రంట్ గా ముందు పెట్టి, బీజేపీని ఓడిస్తారా? అని ప్రశ్నించగా..అది కుదిరే పనికాదు. థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ ఈ దేశంలో గెలుస్తుందని నేను నమ్మను. ఒకవేళ బీజేపీని మనం ఫస్ట్ ఫ్రంట్గా భావిస్తే, సెకండ్ ఫ్రంట్గా ఎదిగిన వారు బీజేపీని ఓడిస్తారు. బీజేపీని ఎవరైనా ఓడించాలంటే వారు సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదగాల్సిందే అంటూ పీకే స్పష్టం చేశారు.