భారత ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ భారత ఆర్మీ చీఫ్గా బాధ్యతల్లో వున్న జనరల్ ఎం.ఎం. నరవాణే శనివారం పదవీ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పాండే ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఇప్పటి వరకూ జనరల్ మనోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్గా పనిచేసిన విషయం తెలిసిందే.కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి మొదటి సారిగా ఆర్మీ చీఫ్గా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. ఆర్మీ చీఫ్ కోసం కేంద్రం జైసింగ్ నయన్, అమర్దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లను కూడా పరిశీలించింది. చివరకు జనరల్ మనోజ్ పాండే వైపు మొగ్గు చూపింది.