Home / POLITICS / రాహుల్‌ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి

రాహుల్‌ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి

నిరుద్యోగుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ కలలు కంటోందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో జాబ్‌ నోటిఫికేషన్లు రావడంతో కాంగ్రెస్‌ నేతల్లో భయం పట్టుకుందని.. అందుకే యూనివర్సిటీల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతర్గ కుమ్ములాటలో తెరాసపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశం మొత్తం చీకట్లో మగ్గుతుంటే తెలంగాణ వెలుగుతోందని చెప్పారు.

ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ  పర్యటన అనుమతి కోరగా వీసీ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌నేతలు చేసిన విమర్శలను జగదీశ్‌ రెడ్డి తిప్పికొట్టారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat