Home / NATIONAL / దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు

దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు.

మరో 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 26 మంది మరణించారు. అయితే మరోవైపు 2723 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా నమోదైన కేసుల్లో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోనే అత్యధికంగా ఉన్నాయి. దేశ రాజధానిలో 1485 కేసులు రికార్డయ్యాయి.మొత్తం కేసుల్లో యాక్టివ్‌గా ఉన్నది 0.05 శాతం మాత్రమేనని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat