రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగళవారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌరస్తా వద్ద ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తూ, వారి శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.
ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేసేందుకు త్వరలోనే గండి రామన్న సమీపంలో కొత్త ఈద్గా నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 12 ఎకరాల స్థలం కేటాయింపుపై ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే ఈద్గా నిర్మాణ పనులు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లింలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.