తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈనెల మే 30న పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి విదితమే. దీంతో ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.