తెలంగాణలో రాహుల్ గాంధీ సభలకు హాజరయ్యేందుకు గాంధీ భవన్లో పాసులు జారీ చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన అధినాయకత్వం. అయితే మహిళా కాంగ్రెస్ విభాగానికి పాసులు పంపిణీ సరిగా జరగడం లేదని మహిళా కార్యకర్తలు ఆందోళన చేశారు. ముఖ్య నేతలకు పాసులు ఇవ్వకపోవడం ఏమిటని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు అసహనం వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్కు బిచ్చం వేసినట్లు పాసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.