ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు మొదలుపెట్టి.. మతం, కులం పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. పచ్చని పాలమూరు జిల్లాలను ఆయన విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రూ.20వేల కోట్లతో పూర్తయ్యేదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్కు కాళేశ్వరం ఏటీఎం అయితే.. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ బీజేపీకి ఏటీఎంలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ కనీస సంస్కారం లేకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారని.. ఆయన కౌన్సిలర్ స్థాయికి కూడా పనికిరారని మండిపడ్డారు.