సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్లు పెళ్ళికి ముస్తాబవుతున్నారు. ఏడేళ్ళ నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట త్వరలో పెళ్ళి పీటలెక్కబోతుంది. తాజాగా ఈ ప్రేమ పక్షులు పెళ్ళికి మూహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
వీరిద్దరు తిరుమలలో శ్రీవారి సన్నిధిలో జూన్ 9వ తేదీన మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. దీని కోసం వీరిద్దరూ తమ పెళ్లి కోసం వేదికను బుక్ చేసుకోవడానికి తిరుమలలో పర్యటిస్తున్నారు. తాజాగా ఈ జంట శ్రీవారిని దర్శించుకున్నారు.