Home / ANDHRAPRADESH / పవన్‌.. ప్రజలకైనా ఓ క్లారిటీ ఇవ్వు: పెద్దిరెడ్డి

పవన్‌.. ప్రజలకైనా ఓ క్లారిటీ ఇవ్వు: పెద్దిరెడ్డి

2024 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుకోక తప్పదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని.. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని ఆయనకీ తెలుసన్నారు. అందుకే పొత్తుల కోసం చేయాల్సిన అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు.

జగన్‌కు ప్రజల్లో అభిమానం ఉందని.. అందుకే వైసీపీ ధైర్యంగా ఒంటరిగా పోటీ చేస్తోందన్నారు. చంద్రబాబు, పవన్‌ తోడు దొంగలని.. ఈ విషయం అందరికీ తెలుసన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకైనా క్లారిటీ ఇవ్వాలని మంత్రి వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాడని పెద్దిరెడ్డి విమర్శించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat