తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీఎం జగన్ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
టెన్త్ ఎగ్జామ్ పేపర్లు ఎక్కడెక్కడ లీక్ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 60 మందిని అరెస్ట్ చేశామని.. వీరిలో 38 మంది ప్రభుత్వ, 22 మంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారని తెలిపారు.