కొడుకు కరోనాతో చనిపోవడంతో అత్తమామలే దగ్గరుండి కోడలి మరో పెళ్లి చేయించారు. అంతేకాకుండా తమ కుమారుడి పేరిట ఉన్న ఇంటిని కూడా కోడలికే రాసిచ్చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో చోటుచేసుకుంది.
రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయి యుగ్ ప్రకాశ్ కుమారుడు ప్రియాంక్ కరోనాతో మరణించాడు. అతడికి భార్య ప్రియాంక, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్ మృతి చెందిన నేపథ్యంలో కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో అత్త, మామ ఆలోచించి ఆమెను సొంత కూతురిలా భావించారు. మరో వ్యక్తితో పెళ్లి చేయించారు. కుటుంబ, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ఈరోజుల్లో.. కోడలి పట్ల అత్తమామలు మానవత్వం చూపించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.