తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పరిశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ..ప్రిన్స్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.
దాదాపు నూట ముప్పై కోట్లకుపైగా వసూళ్లను సాధించినట్లు మీడియాలో ప్రసారం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో థియేట్రికల్ రన్ పూర్తైన 4 వారాల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానుందట.