Home / SLIDER / తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెటిజన్లు మరోసారి సెటైర్లు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెటిజన్లు మరోసారి సెటైర్లు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇటీవల చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి, తనతో మాట్లాడారని సోషల్‌ మీడియాలో బండి సంజయ్‌ పోస్ట్‌ పెట్టారు. ప్రధానితో అనేక విషయాలు మాట్లాడినట్టు రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు విసిరారు.

‘బండికి హిందీ రాదు.. మోదీకి తెలుగు, ఇంగ్లిష్‌ రాదు.. ఎట్లా మాట్లాడుకున్నరు? కొంచెం ఆ ఆడియో ఉంటే పెట్టన్నా’ అని ఒక నెటిజన్‌ సెటైర్‌ వేశారు. ‘హిందీలో మాట్లాడినవా? అగో అదెట్ల సంజూ బ్రో’ అని ఒకరు, ‘ఇంత సంభాషణ జరిగిందా? ఏం క్రియేటివిటీ.. మీ క్రియేటివిటీ తగలెయ్య’ అని మరో నెటిజన్‌ పంచ్‌ ఇచ్చారు. సభలు, యాత్రలు సక్సెస్‌ అయితే సరిపోదు. కరీంనగర్‌ను అభివృద్ధి చేయా లి’ అని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించారు. ‘మోదీ కొన్నేండ్లుగా ప్రధానిగా ఉన్నా రు.

ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని మీరు చెప్తున్నా రు. మరి బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా అయితది? కేసీఆర్‌ వల్ల ప్రజలకు మంచి జరగడం లేదని మీరు అనుకుంటే.. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అన్నీ మీరే చేయండి.. కేసీఆర్‌ ప్రజలకు అన్యాయం చేయడు. ఎన్నో లక్షల గొంతుక. తెలంగాణ బిడ్డలకు ఆత్మగౌరవం దక్కిందంటే వంద శాతం కేసీఆర్‌ కారణం’ అని ఒక నెటిజన్‌ పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat