తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైయ్యారు. అభ్యర్ధి వద్దిరాజు రవిచంద్రకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి అజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం దకుతున్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.