పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ధావన్ ఘనత సాధించాడు.
ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైదరాబాద్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ధావన్ పేరిట ఐపీఎల్లో ఇప్పుడు మొత్తం 701 ఫోర్లు ఉన్నాయి. అతని తర్వాత జాబితాలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇప్పటి వరకు వార్నర్ 577, కోహ్లీ 576 ఫోర్లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాటర్గా కూడా ధావన్ నిలిచాడు. అతను ఇప్పటి వరకు 6244 రన్స్ చేశాడు.