Home / SLIDER / కోహ్లీ రికార్డును సమం చేసిన బట్లర్

కోహ్లీ రికార్డును సమం చేసిన బట్లర్

 రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న ఆ హిట్ట‌ర్ ఇప్పుడో రికార్డును స‌మం చేశాడు. టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్య‌ధిక సెంచ‌రీల‌ రికార్డును అత‌ను స‌మం చేశాడు.

ఈ యేటి సిరీస్‌లో బ‌ట్ల‌ర్ నాలుగు సెంచ‌రీలు న‌మోదు చేశాడు. శుక్ర‌వారం ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్లోనూ బ‌ట్ల‌ర్ సూప‌ర్ షో క‌న‌బ‌రిచాడు. మోదీ స్టేడియంలో ప‌రుగుల ప్ర‌వాహం సృష్టించాడు.

గ‌తంలో 2016 సీజ‌న్‌లో కోహ్లీ కూడా నాలుగు సెంచ‌రీలు చేశాడు. ఆ సీజ‌న్‌లో కోహ్లీ 973 ర‌న్స్ చేశాడు.ఇక బ‌ట్ల‌ర్ ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే 824 ర‌న్స్ చేశాడు. 58.86 స‌గ‌టుతో అత‌ను ఈ ప‌రుగులు సాధించాడు. ఇక స్ట్ర‌యిక్ రేట్ 151.47గా ఉంది. ఈ సీజ‌న్‌లో బ‌ట్ల‌ర్ త‌న ఖాతాలో నాలుగు హాఫ్ సెంచ‌రీలు కూడా వేసుకున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat