ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల అభివృద్ధితోపాటు వ్యవసాయానికి నిరంతర విద్యుత్తును ఉచితంగా అందిస్తూ.. వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ యావత్ దేశంలోనే నంబర్ వన్ సీఎంగా నిలిచారు. వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించిపోయింది. ఆ ఘనత కూడా సీఎం కేసీఆర్దే’నని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి.. వర్జినియా రాష్ట్రం ఆల్డి నగరంలో ఏనుగు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
ఎన్ఆర్ఐ డెవలప్మెంట్ ఫోరానికి చెందిన బొజ్జ అమరేందర్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించిపోయిందన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో కేంద్రం చేతులెత్తేస్తే కేసీఆర్ మానవీయ కోణంలో స్పందించి సేకరించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు పరిచిన మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో సహా దేశ, విదేశీ సంస్థలు కితాబిచ్చాయని తెలిపారు.
విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, 24 గంటల నిరంతర విద్యుత్తు, వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా అద్భుతమైన పాలన అందిస్తున్న కేసీఆర్ యావత్ దేశానికి అభివృద్ధి నమూనాను చూపించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నంద్యాల దయాకర్రెడ్డి, ఎన్ఆర్ఐలు శ్రీనివాస్రెడ్డి, మనోహర్, కాల్వల విష్ణు, పాదూరి శ్రవణ్, బొజ్జ అమరేందర్, కొండారపు సుధ, బాబూరావు పాల్గొన్నారు.