Home / SLIDER / చింతల్ డివిజన్ లో ‘పట్టణ ప్రగతి‘ కార్యక్రమంలో ఎమ్మెల్యే Kp పర్యటన…

చింతల్ డివిజన్ లో ‘పట్టణ ప్రగతి‘ కార్యక్రమంలో ఎమ్మెల్యే Kp పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రంగానగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో ఇప్పటివరకు చేపట్టిన పనులు, వాటి పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు.

మిగిలిన సీసీ రోడ్లు పూర్తి చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గారిని కోరగా వెంటనే స్పందించి రూ.35 లక్షలు కేటాయించి త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా రోడ్లు, నాలాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీసీ ప్రశాంతి, ఈఈ గోవర్ధన్, ఏఎంసీ శ్రీనివాస్, టీమ్ లీడర్&ఏఈ సంపత్, వాటర్ వర్క్స్ మేనేజర్ పూజిత, శానిటేషన్ డిఈ ప్రశాంతి, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ సౌజన్య, ఎస్ఎస్ పోతారెడ్డి మరియు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, కాలనీ చీఫ్ అడ్వైజర్ సీతారామయ్య, ప్రెసిడెంట్ మధు కుమార్, వైస్ ప్రెసిడెంట్ హనుమంత రావు, బాలచన్నయ్య, జెనరల్ సెక్రెటరీ ఆంజనేయులు, ట్రెజరర్ కృష్ణ రావు, జాయింట్ సెక్రటరీ సాయికుమార్ యాదవ్, డివిజన్ నాయకులు కర్నేకంటి మల్లేష్, బస్వరాజు, వరప్రసాద్, శ్రీశైలం, వార్డు మెంబర్ మెహెరున్నిసా బేగం తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat