తెలంగాణ ఏర్పడిన కొత్తలో అనేక ఇబ్బందులు పడ్డామని.. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి అనేక పరిశ్రమలను తెచ్చుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం అనేక ఇండస్ట్రీలు వస్తున్నాయని చెప్పారు. పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను కేటీఆర్ ఈరోజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకమని చెప్పారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్.. ఈ ట్రిపుల్ ‘ఐ’ తమ నినాదాలని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా టీఎస్ ఐపాస్ గురించి మాట్లాడుతున్నారని.. పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంలో ఆలస్యం జరిగితే ఫైన్ వేసే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని.. తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని కేటీఆర్ వివరించారు.