Home / SLIDER / ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ వద్ద పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొని సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వీధి ద్వీపాలు, పారిశుధ్య నిర్వహణ, పార్క్ అభివృద్ధి, మిగిలిన భూగర్భడ్రైనేజీలను పూర్తి చేయాలని కొరారు.

.. ఎమ్మెల్యే గారు అక్కడే ఉన్న అధికారులకు వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని కాలనీల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసి మంగతాయారు, వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి, ఈఈ కృష్ణ చైతన్య, డిజిఎం రాజేష్, ఏఈ సురేందర్ నాయక్, గణేష్ హౌసింగ్ కాలనీ ప్రెసిడెంట్ యాదగిరి, వార్డు సభ్యులు సుధాకర్ గౌడ్, ఇందిరా రెడ్డి, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, జ్ఞానేశ్వర్, కాలే నాగేష్ మరియు రుక్మిణీ ఎస్టేట్స్, జయరాం నగర్, మహానగర్ ఎస్టేట్స్, బౌద్ధ నగర్, జీడిమెట్ల, ఎంఎన్ రెడ్డి నగర్ ఫేస్-2, భద్రసాయి నగర్ కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat