టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని.. ఇది తప్పా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంగ్లిష్ మీడియం అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. ఈ విషయాన్ని సీఎం జగన్ కూడా చెప్పారని సజ్జల గుర్తు చేశారు. అయితే దీనితో దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. పరీక్షలను నిష్పక్షపాతంగా జరిపామా? లేదా? అనేదే క్రైటీరియా అని చెప్పారు