Home / ANDHRAPRADESH / వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ మనవే కావాలి: జగన్‌

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ మనవే కావాలి: జగన్‌

రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు కూడా గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైకాపా అధినేత, సీఎం జగన్‌ సూచించారు. అమరావతిలో పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు. ముఖ్యనేతలతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు సాధించడమే మనందరి లక్ష్యం కావాలని.. అది కష్టం కూడా కాదని చెప్పారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తామని.. కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని అనుకున్నామా? అని ప్రశ్నించారు. కష్టపడితే రానున్న ఎన్నికల్లో 175 సీట్లు సాధించగలుగుతామని చెప్పారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిరంతర కార్యక్రమం. దాదాపు 8 నెలల పాటు ఇది కొనసాగుతుందని తెలిపారు. ఒక్కో సచివాలయం పరిధిలో రెండు రోజులు దీనికి కేటాయించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat