సమైక్య పాలనలో ఆర్టీసీ కొత్త డిపోలకు నోచుకోలేదని, తెలంగాణలో ఆర్టీసీని సీఎం కేసీఆరే బతికించారని మంత్రి అజయ్కుమార్ చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్.. బడ్జెట్లో సంస్థకు నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. సంస్థ బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు.
కార్గో ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరుతున్నదని తెలిపారు. నర్సాపూర్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్ని బస్సులు అవసరం ఉన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతశేఖర్గౌడ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, మెదక్ కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.