టాలీవుడ్ లోనే బడా నిర్మాతగా.. సంక్రాంతి నిర్మాతగా పేరు తెచ్చుకున్న MS రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఎంఎస్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరోలు.. సీనియర్లైన సరే ‘పదేపదే స్టార్ హీరోలతో సినిమాలు తీయను. కథే ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా స్క్రిప్ట్ బాగోలేకపోతే సినిమా చేయను. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఖలేజా చేద్దామని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నాకు చెప్పిన కానీ నేను ఆయన మాట వినలేదు.
స్టార్ హీరోలైన మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ కలిసి సినిమా చేద్దామన్నా నేను వారితో చేయను. పెద్ద హీరోల సినిమాల కంటే మనసంతా నువ్వే చిత్రంతోనే నాకు ఎక్కువ లాభాలు వచ్చాయి’ అని ఆయన ఈ సందర్భంగా చెప్పాడు.