జనసేన అధినేత,పవర్ స్టార్ ,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ,భీమ్లా నాయక్ మూవీల తర్వాత ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తమిళంలో నిర్మితమై విడుదలై సూపర్ హిట్టయిన ‘వినోదయ సిత్తం’ రీమేక్ను త్వరలో మొదలు పెట్టనున్నాడు.
ఒరిజినల్ వెర్షన్ను తెరకెక్కించిన సముద్రఖని రీమేక్ను కూడా తెరకెక్కిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్గా మారింది.ఈ చిత్రంలో హీరోయిన్గా పలువరు పేర్లు అనుకున్న కేతిక శర్మను ఫైనల్ చేశారని టాక్.
గతంలో శర్మ రొమాంటిక్, లక్ష్యం సినిమాలలో హీరోయిన్గా నటించింది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది. జూలైలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రం కోసం పవన్ 20రోజుల కాల్షీట్లు ఇచ్చాడని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీ.జీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.